ట్విట్టర్ ఉద్యోగులను చంపేస్తాం...

 

ప్రముఖ సామాజిక మీడియా వెబ్ సైట్ ట్విట్టర్లో పనిచేసే ఉద్యోగులను చంపేస్తామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ హెచ్చరికల్ని కూడా ట్విట్టర్లోనే ట్విట్ చేయడం వెరైటీ. అమెరికా, యూరప్ దేశాల్లో వున్న తమ స్లీపర్ సెల్స్ ఈ ఘనకార్యాన్ని పూర్తి చేస్తాయని, ఇప్పటికే అనేకమంది ట్విట్టర్ ఉద్యోగుల మీద నిఘా ఏర్పాటు చేశామని, సమయం సందర్భం చూసి వారిమీద దాడి చేసి చంపేస్తామని సదరు తీవ్రవాదులు ట్విట్ చేశారు. అలాగే శాన్‌ఫ్రాన్సిస్కోలో వున్న ట్విట్టర్ ఉద్యోగులందరికీ మూడిందని, వారిదరినీ చంపేయడం ఖాయమని తీవ్రవాదులు ప్రకటించారు. ట్విట్టర్లో పనిచేసే ఉద్యోగులు త్వరలో తాము చావబోతున్నామని డిసైడ్ అవ్వాలని తీవ్రవాదులు తమ ట్విట్‌లో పేర్కొన్నారు. తీవ్రవాదులు నిర్వహిస్తున్న ట్విట్టర్ అకౌంట్లను ట్విట్టర్ తొలగించిన నేపథ్యంలో తీవ్రవాదులు ఈ హెచ్చరికలు చేశారు.