భారత్ ముందు భారీ లక్ష్యం

భారత్-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లాండ్ టీమిండియా ముందు భారీ లక్ష్యం నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్ దూకుడుతో మరోసారి 300 పరుగులు దాటింది. ముఖ్యంగా ఇంగ్లాండ్ ఓపెనర్లు జాసన్‌రాయ్-బిల్లింగ్స్‌ తొలి వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు భారీ స్కోరు సాధించేందుకు బాటలు వేశారు. ఆ తర్వాత కెప్టెన్ మోర్గాన్, బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, వోక్స్ ధాటిగా ఆడటంతో ఇంగ్లీష్ టీం నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. భాతర బౌలర్లలో హార్డిక్ పాండ్యా 3, జడేజా, బుమ్రా 1 వికెట్ తీసుకున్నారు.