ఇంగ్లండ్, భార‌త్‌ మొదటి ఇన్సింగ్స్.. 537 పరుగులు చేసిన ఇంగ్లండ్..

 

ఇంగ్లండ్, భార‌త్‌ క్రికెట్ టీమ్‌ల మ‌ధ్య మొద‌టి టెస్టు మ్యాచు మొదటి ఇన్సింగ్స్ ప్రారంభమైంది. రాజ్ కోట్ వేదిక జరిగిన ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ టీమ్.. 159.3 ఓవర్లకు 537 పరుగులకు చేసి ఆలౌటయింది. టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. క్రీజులోకి విజ‌య్‌, గంభీర్‌లు ఓపెనర్లుగా వ‌చ్చారు. ప్ర‌స్తుతం విజ‌య్ 19 గంభీర్ 11 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. టీమిండియా స్కోరు వికెట్ న‌ష్ట‌పోకుండా ప‌ది ఓవ‌ర్ల‌కు 35గా ఉంది.

 

ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ స్టోక్స్ 128 ప‌రుగులు చేయ‌గా, రూట్ 124, అలీ 117 ప‌రుగుల చేశారు. కాగా, కుక్ 21, హమీద్ 31, డకెట్ 13, బైర్‌స్టో 46, వోక్స్ 4, ర‌షీద్ 5, అన్సారీ 32 ప‌రుగులు చేశారు. భారత బౌలర్లలో జడేజా 3 వికెట్లు తీశారు. ఉమేష్‌, షమీ, అశ్విన్‌లకు చెరో రెండు వికెట్లు దక్కగా, అమిత్‌ మిశ్రాకు ఓ వికెట్ తీశాడు.