రైలు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

విజయనగరం జిల్లాలో శనివారం అర్థరాత్రి జరిగిన హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది విషాదకర ఘటన అని అన్నారు..ఈ ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయిన వారందరికి సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంలో 32 మంది మరణించగా..50 మందికి పైగా గాయపడ్డారు..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News