కిక్కిరిసిన సాయి మందిరాలు..ఘనంగా గురుపౌర్ణమి

దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు అంబరాన్ని తాకాయి. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున సాయిబాబా ఆలయాలకు క్యూకట్టారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం షీర్డితో పాటు పలు నగరాల్లోని బాబా మందిరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉదయం నుంచి రాత్రి వరకు మంగళ హారతులతో...సాయి నామస్మరణతో భక్తులు పులకించిపోయారు. కొన్ని ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అటు తెలుగు రాష్ట్రాల్లోనూ గురుపౌర్ణమి ఘనంగా జరిగింది. హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్, పంజాగుట్ట, ఫిల్మ్‌నగర్ సాయిబాబా దేవాలయాలతో పాటు విశాఖ, విజయవాడ, తిరుపతి తదితర నగరాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు సాయి నామస్మరణలో మునిగితేలారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu