గేట్ ఫలితాలు విడుదల ... రాష్ట్ర విద్యార్థుల హవా

ఇంజనీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఫిబ్రవరి 10న దేశవ్యాప్తంగా నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టేస్ట్ (గేట్) ప్రవేశ పరీక్షనిర్వహించింది. ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 10 లక్షలమంది హాజరయ్యారు.  గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టేస్ట్ - 2013 ఫలితాలు విడుదలయ్యాయి. ఆలిండియా స్థాయిలో జరిగే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టేస్ట్ (గేట్)లో రాష్ట్ర విద్యార్థులు తమ సత్తా చాటారు. ఈసీఈలో మొదటి ర్యాంక్ తో పాటు 3,4,5,6,7,8,10 ర్యాంకులను రాష్ట్ర విద్యార్థులు కైవసం చేసుకున్నారు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ వాసి పోతుల శివహర్ష మొదటి ర్యాంక్ ను సాధించాడు. ఐఎన్ ఇంజనీరింగ్ విభాగంలో మొదటి ర్యాంక్ తో పాటు ఐదవ ర్యాంక్ సాధించారు. ఈసీఈలో మొదటి ర్యాంక్, ఈఈఈలో అన్నందేవుల రవితేజ 2వ ర్యాంక్ తో పాటు 6, 8  ర్యాంక్ లను, సీఎస్ఈలో 4,6,9, ర్యాంకులను సాధించి జాతీయస్థాయిలో తమ సత్తాను చాటుకున్నారు.