చంద్రబాబుకు గాలి జనార్ధనరెడ్డి ఆఫర్

 

కడప స్టీల్ ప్లాంట్ కోసం ఓ వైపు టీడీపీ నేతలు సీఎం రమేష్, బి.టెక్ రవి దీక్షలు చేస్తుంటే.. మరోవైపు గాలి జనార్ధనరెడ్డి, చంద్రబాబుకి ఓ ఆఫర్ ఇస్తున్నారు..  స్టీల్ ఫ్యాక్టరీ కోసం బాబు కిందా మీదా పడాల్సిన అవసరం లేదని.. తనకి అవకాశం ఇస్తే, కేవలం రెండేళ్లలో బ్రాహ్మణి స్టీల్ ఫ్యాక్టరీని కట్టి చూపిస్తానంటూ గాలి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.. ఒకవేళ తాను చెప్పినట్లుగా రెండేళ్లలో బ్రాహ్మణి స్టీల్ ఫ్యాక్టరీని కట్టలేకపోతే, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని సవాల్ విసిరారు.. బ్రాహ్మణి స్టీల్ కోసం తాను ఇప్పటివరకూ రూ.1350 కోట్లు పెట్టుబడి పెట్టానని చెప్పిన గాలి.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలే స్టీల్ ఫ్యాక్టరీ కట్టేందుకు ముందుకు వస్తే తాను సహకరిస్తానన్నారు.. ఒకవేళ వేరే వారికి స్టీల్ ఫ్యాక్టరీ కట్టేందుకు అనుమతి ఇస్తే మాత్రం తాను పెట్టిన రూ.1350 కోట్ల పెట్టుబడిని వెనక్కి ఇవ్వాలని అన్నారు.. చూద్దాం మరి గాలి ఇచ్చిన ఆఫర్ కి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో.