క్షమాపణ చెప్పిన కేజ్రీవాల్

 

రెండు రోజుల క్రితం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద గజేంద్ర సింగ్ అనే రైతు ఆత్మహత్య చేసుకొన్న సంగతి తెలిసిందే. దీనిపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. పార్లమెంట్ లో గందరగోళం జరిగింది. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పెద్ద ఇరకాటంలో పడ్డారు. ఘటన జరిగి అనేక ఆందోళనలు జరిగిన తరువాత ఇప్పుడు కేజ్రీవాల్ నోరు విప్పారు. ఘటన జరిగిన తరువాత నేను ప్రసంగించకుండా ఉండాల్సింది ఎవర్నైనా బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి అంటూ ఆఖరికి క్షమాపణ చెప్పారు. ఘటన జరిగిన తరువాత పదినిమిషాలు ఆయన మాట్లాడుతూ గజేంద్రసింగ్ ను కాపాడటంలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారని ప్రసంగించారు. దీంతో ప్రతిపక్షాలు, పోలీసులు ఒక్కసారిగా ఆయనపై విమర్శల వర్షం కురిపిరంచారు. గజేంద్ర ఆత్మహత్య చేసుకుంటున్న సమయంలో ఆప్ కార్యకర్తలు చోద్యం చూస్తూ కూర్చున్నారని, వారు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu