ప్రధానమంత్రి ఆఫీసులో మంటలు

 

 

 

ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయంలో మంటలు చెలరేగాయి. మంగళవారం తెల్లవారుఝామున ప్రధాని కార్యాలయం సౌత్ బ్లాక్‌లోని ఒక గదిలో మంటలు రేగాయి. సదరు గదిలోని కంప్యూటర్ యు.పి.ఎస్.‌లో షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల మంటలు, పొగ వ్యాపించాయి. దాంతో ఫైర్ అలారం మోగింది. ప్రధాని కార్యాలయంలో ఫైర్ అలారం మోగడంతో హడావిడి జరిగింది. ఫైర్ సిబ్బంది అలెర్ట్ అయి అగ్ని ప్రమాద స్థలానికి చేరుకున్నారు. మంటల్ని అదుపు చేశారు. అక్కడ జరిగింది పెద్ద ప్రమాదమేమీ కాదనితేల్చి చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.