మలేసియా విమాన శకలం దొరికింది..ట!

 

 

 

గత నెల 8వ తేదీన 259 ప్రయాణికులతో సహా గల్లంతైన మలేసియా విమానం కోసం అప్పటి నుంచి తీవ్రంగా గాలింపు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విమానానికి సంబంధించిన శకలాన్ని బంగాళాఖాతంలో కనుక్కున్నట్టు ఆస్ట్రేలియాకి చెందిన సముద్ర అన్వేషణ సంస్థ ప్రకటించింది. హిందూ మహా సముద్రానికి ఐదు వేల కిలోమీటర్ల దూరంలో వున్న బంగాళాఖాతంలో విమాన శకలాన్ని కనుగొన్నామని సదరు సంస్థ ప్రతినిధి చెప్పారు. అయితే ఈ విషయాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం గానీ, మలేసియా ప్రభుత్వం గానీ అధికారికంగా ధ్రువీకరించలేదు.