కోడెల మృతిపై కేసు నమోదు.. కొడుకే హత్య చేసాడు!!
posted on Sep 16, 2019 6:33PM
టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై ఆయన సమీప బంధువు కంచేటి సాయి సంచలన ఆరోపణలు చేశారు. కోడెల కుమారుడు శివరామే ఆస్తికోసం ఆయనను హత్య చేశాడని ఆరోపించారు. ఈ మేరకు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. కోడెలకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని.. శివరామే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కోడెల తనకి పలుమార్లు ఫోన్ చేసి.. కుమారుడు శివరాం తనను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కోడెల తన ఆవేదనను నాతో పంచుకున్నారని సాయి చెప్పుకొచ్చారు. తన ఆస్తులను శివరామ్ పేరుమీదకు మార్చకపోతే చంపుతానని బెదిరిస్తున్నాడని, శివరామ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనను కాపాడాలని కోడెల వేడుకున్నారని తెలిపారు. తండ్రిని ఇబ్బంది పెట్టవద్దని తాను కూడా ఫోన్లో పలుసార్లు శివరామ్కు సూచించానని సాయి అన్నారు. తనని కలిసి మాట్లాడేందుకు ప్రయత్నించానని.. అయితే అది కుదరలేదని వివరించారు. కోడెల మృతిపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలని సాయి డిమాండ్ చేశారు.