భారత్‌లో అడుగుపెట్టిన ట్రంప్... గ్రాండ్ వెల్ కమ్ చెప్పిన మోడీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... భారత్ లో అడుగుపెట్టారు. అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండైన ట్రంప్ కు ప్రధాని మోడీ ఘనస్వాగతం పలికారు. ట్రంప్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకుని తమ మధ్య ఉన్న సత్సంబంధాలను మోడీ చాటిచెప్పారు. అనంతరం, బీస్ట్ కారులో ట్రంప్ దంపతులు... రోవర్ కారులో మోడీ కలిసి అహ్మదాబాద్ రోడ్ షోలో నిర్వహిస్తున్నారు. ట్రంప్ పర్యటన సందర్భంగా అహ్మదాబాద్ లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇక, రోడ్డుకిరువైపులా నిలబడ్డ ప్రజలు... అమెరికా, ఇండియా ప్లాగ్స్ ను ఊపుతూ... ట్రంప్ కు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు.