ధోనీ రికార్డు

టీం ఇండియా కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ రికార్డు సృష్టించాడు. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సారథ్యంలో టీం ఇండియా 22 టేస్ట్ మ్యాచ్ లను గెలిచింది. ఆస్ట్రేలియాతో హైదరాబాద్ లో జరిగిన రెండవ టేస్ట్ మ్యాచ్ ను గెలిచి ఆ రికార్డును తిరగరాశాడు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ ఇదంతా గోరింటాను కొండంత చేయడమేనని, డ్రెస్సింగ్ రూమ్ లో జట్టు సభ్యులు ఎవరూ ఎన్ని మ్యాచ్ లు గెలిచామని చర్చించమని, టేస్ట్ మ్యాచ్ లు గెలవడమే ముఖ్యమని తెలిపాడు. టీం ఇండియా జట్టు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా సీరీస్ లో పరాజయాల పాలైన తరువాత ఆత్మవిమర్శ చేసుకున్నామని, తాను తీవ్ర ఒత్తిడికి గురయ్యానని తెలిపాడు. జట్టు సభ్యుల్లో పుజారా, మురళీ విజయ్ రెండవ టెస్టులో ఆడిన అద్భుత ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ వారిపై ప్రశంసల వర్షం కురిపించాడు.