చెన్నై టెస్ట్: ముగిసిన ధోని ధనాధన్ ఇన్నింగ్స్
posted on Feb 25, 2013 10:47AM
ఆస్ట్రేలియా పై ధోని ధనాధన్ ఇన్నింగ్స్ ముగిసింది. మొదటి ఇన్నింగ్స్లో ఇండియా 572 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో భారత్ కు 192 పరుగుల ఆధిక్యం దక్కింది. ఎనిమిది వికెట్ల నష్టానికి 515 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ 57 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అద్భుతమైన ఇన్నింగ్సు ఆడి సోమవారం ఉదయం అవుటయ్యాడు. అతను 224 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పాటిన్సన్ బౌలింగులో అవుటయ్యాడు. ధోనీ తర్వాత భువనేశ్వర్ కుమార్ 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ కావడంతో భారత ఇన్నింగ్స్ 572 పరుగుల వద్ద ముగిసింది. ఆసీస్ బౌలర్లు పటిన్సన్ ఐదు వికెట్లు, లైయోన్ మూడు వికెట్లు, సిడిల్ ఒకటి, హెన్సిక్స్ ఒక వికెట్ను తీశారు. తొలి ఇన్నింగ్స్లో ఆసిస్ 380 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.