తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. సోమవారం 69వేల 879 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

29వేల 519 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.82 కోట్లు వచ్చింది. ఇక మంగళవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో 20 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News