ఢిల్లీలో ప్రభుత్వం.. బీజేపీకి ఆహ్వానం...?

 

ఢిల్లీలో నూతన ప్రభుత్వ ఏర్పాటు చేయాలంటూ లెఫ్ట్ నెంట్ గవర్నర్ రాజ్ నివాస్ బీజేపీకి ఆహ్వానించడంపై కాంగ్రెస్ మండిపడింది. ఢిల్లీలో అత్యధిక సీట్లు గెలుచుకున్న బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు చేసినట్లు వార్తలు రావడంతో కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తోంది. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు అనేది అప్రజాస్వామికం అని స్థానిక కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనివ్వమని డీపీసీసీ అధికార ప్రతినిధి ముఖేష్ శర్మ హెచ్చరించారు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాట చేయాలని అనుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమంటూ రాష్ట్రపతికి వినతిపత్రం ఇచ్చారు.