నిర్భయ నిందితులకు ఈ నెల 10న శిక్ష ఖరారు
posted on Sep 3, 2013 8:18PM
ఇటీవల నిర్భయ కేసులో తొలితీర్పు చెప్పిన కోర్టు ఈ నెల 10న మిగతా నిందితులకు కూడా శిక్షలు ఖరారు చేయనుంది. ఇప్పటికే ఈ కేసులో విచారణ పూర్తిచేసిన సాకేత్ కోర్టు నలుగురు నిందితులు ముఖేష్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్లకు శిక్షవిదించనుంది. ఇప్పటికే ఈ కేసులో ముద్దాయిగా ఉన్న మైనర్ బాలుడికి జువైనల్ కోర్టు మూడేళ్ల శిక్ష విధించింది.
గత డిసెంబర్ 16 రాత్రి డిల్లీలో కదులుతున్న బస్సులో ఆరుగురు నిర్భయపై అత్యాచారానికి పాల్పాడ్డారు. ఈ దాడిలో పాల్గొన్న వారలో ఒకరిపై జైల్లో దాడి జరిగి మరణించగా మరోకడికి జువైనల్ కోర్టు తాజాగా శిక్ష ఖరారు చేసింది. మిగిలిన నలుగురికి ఈ నెల 10న శిక్ష ఖరారు చేయనున్నారు.