దాశరథి స్మారక పురస్కారం!

 

ప్రముఖ కవి, సాహితీవేత్త దివంగత దాశరథి కృష్ణమాచార్య పేరిట స్మారక పురస్కారాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన కవికి ప్రతి సంవత్సరం దాశరథి పురస్కారం పేరిట లక్షా నూట పదహారు రూపాయలు అందజేసి సన్మానిస్తామని కేసీఆర్ తెలిపారు. దాశరథి 89వ జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా రవీంద్రభారతిలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దాశరథి పేరిట కేసీఆర్ ప్రకటించిన మరికొన్ని అంశాలు..

 

1. తెలంగాణ రాష్ట్రంలోని ఏదైనా విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థకు దాశరథి పేరు.

 

2. నగరంలోని ముఖ్యమైన ప్రాంతంలో దాశరథి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం.

 

3. దాశరథి కుమారుడికి . ఆయన కుమారుడికి ప్రభుత్వంలో మంచి ఉద్యోగం.