'రాయల తెలంగాణ' ఓ కుట్ర

 

 

 

కొత్త ప్రతిపాదనల వెనుక కొన్ని శక్తులు ఉన్నాయని, అలాంటి వాళ్ళ ఆశలు నెరవేరవని, రాయల తెలంగాణ ప్రచారం ఓ కుట్ర అని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్ పేర్కొన్నారు. 2014 లోపు తెలంగాణ రాష్ట్రం తప్పక ఏర్పడుతుందని తెలిపారు.10 జిల్లాల తెలంగాణనే కావాలని డీఎస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నాక ప్రత్యామ్నాయాలను ఆలోచించదని ఆయన తెల్చి చెప్పారు. అసెంబ్లీలో మెజార్టీ అవసరం లేదని, అభిప్రాయం చాలని డి. శ్రీనివాస్ తెలిపారు. అసెంబ్లీలో మెజార్టీకి, తెలంగాణ బిల్లుకు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు.