భయపెడుతున్న 'పైలాన్ తుఫాన్'
posted on Oct 11, 2013 6:56PM
ఆంద్ర ప్రదేశ్ లోని సముద్ర తీర ప్రాంతాలను ఈ పైలాన్ తుఫాన్ వణికిస్తోంది. గత 120 సంత్సరాలలో ఇది 74 వ పెను తుఫాన్ గా వాతావరణ శాఖ పరిశోధకులు తెలియ చేస్తున్నారు. దీని ప్రభావం ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్టణం జిల్లాల మీద ఎక్కువగా ఉండనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పలు చోట్ల సముద్రం ముందుకు చోచ్చుకోస్తోంది. లోతట్టు ప్రాంత ప్రజలను ప్రభుత్వ అధికారులు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భయం గుప్పిట్లో తీర ప్రాంత ప్రజలు ఉన్నారు. విశాఖ వద్ద సముద్రం అల్లకల్లోలం గా ఉంది. రాష్ట్రానికి ఈ తుఫాన్ కారణంగా పెను ముప్పు పొంచి ఉంది. రేపు సాయత్రం ఒరిస్సాలోని గోపాలపూర్ వద్ద తీరాన్ని తాకవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలియ చేస్తున్నారు. కళింగపట్నానికి 450 కిలోమీటర్ల దూరంలో పైలాన్ తుఫాన్ కేంద్రికృతమై ఉన్నట్లు సమాచారం.