ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 68 మందికి కరోనా నిర్ధారణ

ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో 9,664 శాంపిల్స్ ను పరీక్షించగా 68 మందికి కరోనా పాజిటివ్‌ గా తేలిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు సంఖ్య 2787కు చేరుకుంది. గత 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో ఒకరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 58కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,913 మంది డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో 816 మంది చికిత్స పొందుతున్నారు.