గందరగోళంగా కానిస్టేబుల్ రాతపరీక్ష ప్రశ్నాపత్రం

కానిస్టేబుల్ పోస్టులకు ఎంపిక చేసేందుకు నిర్వహించిన రాతపరీక్షల్లో రెండు భాషల్లో వేర్వేరు అర్థాలున్న రెండు ప్రశ్నలు, వాటికి రెండు వేర్వేరు జవాబులు ఇచ్చారు. ఇలాంటి అరుదైన సంఘటన అభ్యర్థులను కలవరపరిచింది. ఈ రాతపరీక్షలకు సీరీస్-ఎ లో ఇచ్చిన 30వ ప్రశ్న గందరగోళంగా ఉంది. ఇంగ్లీసు భాషలో కేంద్ర హోంమంత్రి ఎవరు? అని ప్రశ్న ఇచ్చారు. తెలుగుభాషలో రక్షణమంత్రి ఎవరు? అని ప్రశ్న ఇచ్చారు. ఈ రెండూ వేర్వేరు అర్థం వస్తాయి కాబట్టి జవాబుల్లో పి.చిదంబరం, ఎ.కె. ఆంటోనీ పేర్లు ఇచ్చారు. దీంతో ఈ ప్రశ్నకు ఎలా సమాధానం రాయాలో అభ్యర్థులకు అర్థం కాలేదు. మొత్తం 20,429 పోస్టులకు ఈ రాత పరీక్ష జరిగింది. సుమారు లక్షా 23వేల మంది అభ్యర్థులు ఈ రాతపరీక్షల్లో గందరగోళానికి ఇబ్బంది పడ్డారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu