నేడు మెహబూబ్ నగర్ జిల్లా బంద్

 

కాంగ్రెస్, తెరాస ఎమ్మెల్యేలు కొట్టుకొని మెహబూబ్ నగర్ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. మొన్న జరిగిన జెడ్పీ సమావేశం తెరాస ఎమ్మల్యే గువ్వల బాలరాజు కాంగ్రెస్ శాసనసభ్యుడు రామ్మోహన్ రెడ్డిపై చెయ్యి చేసుకొన్నారు. అందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మెహబూబ్ నగర్ జిల్లా బంద్ కి పిలుపునిచ్చింది. కాంగ్రెస్ కార్యకర్తలు డిపోలలో నుండి బస్సులను బయటకి రాకుండా అడ్డుపడటంతో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి.

 

ఈ విషయం తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి వెళ్ళినా ఆయన కానీ ఆయన తరపున మంత్రులెవరూ ఈ వ్యవహారంపై స్పందించలేదు. వారు స్పందించకపోవడం చూస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేపై చెయ్యి చేసుకొన్న బాలరాజును సమర్దిస్తున్నట్లే ఉందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. తెరాస ఎమ్మెల్యే బాలరాజు తమ ఎమ్మెల్యేపై దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగానిస్తున్నామని టీ-కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత కె. జానారెడ్డి అన్నారు. టీ-కాంగ్రెస్ నేతలు గవర్నర్ ని కలిసి తెరాస ఎమ్మెల్యేపై పిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu