అధిష్టానం మూగ, చెవిటి, గుడ్డిది : జేసి

 

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌ అనుసరిస్తున్న వైఖరిని ఆపార్టీ సీనియర్‌ నాయకుడు జెసి దివాకర్‌రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్‌ అధిష్టానం మూగ, చెవిటి, గుడ్డిదానిలా వ్యవహరిస్తుందని ఎద్దేవా చేశారు. అందువల్లే అధిష్టానం మొండిగా వ్యవహరిస్తుందని, ఇప్పటికే సీమాంద్ర ప్రాంతంలో ఆ పార్టీ పూర్తిగా చచ్చిపోయిందని ఆయన అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన తనకు పార్టీ వీడాలంటే చాలా బాధగా ఉందని కానీ అధిష్టానం మాత్రం పార్టీలో కొనసాగే పరిస్థితి కల్పించటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ తప్పని సరి పరిస్థితిల్లో కాంగ్రెస్‌ పార్టీని వీడినా మరే ఇతర పార్టీలో చేరనని తేల్చి చెప్పారు.