మావోల చెర నుంచి కోబ్రా కమాండో రిలీజ్ 

ఈ నెల 3న ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భీకర కాల్పుల అనంతరం బందీగా చేసుకున్న సీఆర్‌పీఎఫ్‌ జవాన్ రాకేశ్వర్‌ సింగ్‌ మన్హాస్‌ను మావోయిస్టులు ఎట్టకేలకు విడుదల చేశారు. గత ఐదు రోజులుగా వారి చెరలో ఉన్న ఆయన్ని గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో టెర్రం అడవుల్లో వదిలిపెట్టారు. మావోయిస్టుల చెర నుంచి విడుదలైన సీఆర్‌పీఎఫ్‌ జవాన్ రాకేశ్వర్‌ సింగ్‌.. టెర్రం క్యాంపస్ కు చేరుకున్నారు. 

కోబ్రా జవాన్ రాకేశ్వర్ మాన్హాస్ నక్సలైట్లను పట్టుకున్న 6 రోజుల తరువాత విడుదల చేశారు. పద్మశ్రీ ధర్మపాల్ సైని, గోండ్వానా సమాజ్ అధ్యక్షుడు తెలం బోరయ్య, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇద్దరు సభ్యుల మధ్యప్రదేశ్ జట్టు సభ్యుడు సహా వందలాది మంది గ్రామస్తుల సమక్షంలో నక్సలైట్లు జవాన్లను విడుదల చేశారు. విడుదలైన తరువాత, మీడియా వ్యక్తుల బృందం జవాన్‌తో బసగుడకు తిరిగొచ్చింది. జవాన్ విడుదల కోసం మధ్యవర్తిత్వం వహించిన ఇద్దరు సభ్యుల బృందంతో పాటు బస్తర్‌కు చెందిన 7 మంది జర్నలిస్టుల బృందం కూడా ఉంది. నక్సలైట్ల పిలుపు మేరకు జవాన్లను విడుదల చేయడానికి చర్చల బృందంతో సహా మొత్తం 11 మంది సభ్యులు కఠినమైన బస్తర్ ప్రాంతానికి వెళ్లింది. 

గత శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌-సుక్మా జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ దాడిలో 23 మంది సైనికులు అమరులయ్యారు. మరో 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ రాకేశ్వర్‌ సింగ్‌ను నక్సల్స్‌ బందీగా చేసుకున్నారు. చర్చలకు మధ్యవర్తులను ప్రకటించాలని.. అడవుల్లో ఏర్పాటు చేసిన భద్రతా బలగాల క్యాంపులను వెంటనే తొలగించాలని మావోయిస్టులు డిమాండ్‌   చేశారు. అప్పుడే రాకేశ్వర్‌ విడిచిపెడతామని షరతు విధించారు. జవాన్‌ తమ వద్ద క్షేమంగానే ఉన్నట్లు బుధవారం ఓ ఫొటోను కూడా విడుదల చేశారు.

రాకేశ్వర్‌ను ఎలాగైనా సురక్షితంగా విడిపించుకురావాలని కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన కూతురు సైతం నాన్నను విడిచిపెట్టాలని మీడియా ద్వారా నక్సల్స్‌ను కోరింది. ఈ పరిణామాల అనంతరం నేడు ఎట్టకేలకు రాకేశ్వర్‌ తిరిగొచ్చారు. ఆయన విడుదలపై భార్య మీనూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.