కరోనా బఫర్ జోన్ లోకి సి ఎం జగన్ నివాసం

గుంటూరు జిల్లా డోలాస్ నగర్ లో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. పాజిటివ్ కేసు నమోదు అయిన గ్యాలక్సీ అపార్ట్ మెంట్ నుంచి ఇరువైపులా ఒక కిలో మీటర్ ప్రాంతాన్ని అధికారులు రెడ్ జోన్ గా ప్రకటించారు. పాజిటివ్ కేసు నమోదు అయిన ప్రాంతంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాలను అధికారులు మూడు జోన్లుగా విభజించారు. ఒక కిలో మీటరు పరిధిని హై రిస్క్ జోన్ గా ప్రకటించారు. మూడు కిలోమీటర్ల పరిధిని రెడ్ జోన్ గాను, ఏడు కిలో మీటర్ల పరిధిని బఫర్ జోన్ గానూ ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి నివాసం ఈ బఫర్ జోన్ లోకే వస్తుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu