టీడీపీ ఎంపీలకు చంద్రబాబు ఆదేశం...ఏపీకి వచ్చేయండి...

 

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని....ఏపీకి కేంద్రం ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చాలని ఏపీ ఎంపీలందరూ గత కొద్దిరోజులుగా పార్లమెంట్ లో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అయిపోయినా కూడా టీడీపీ ఎంపీలందరూ అక్కడే ఉండి నిరసనలు చేస్తూనే ఉన్నారు. ఈ సందర్బంగా చంద్రబాబు టీడీపీ ఎంపీలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ సందర్భంగా మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో ఉద్యమించిన టీడీపీ ఎంపీలను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. ప్రధాని మోదీ నివాసాన్ని ముట్టడించడం, రాజ్ ఘాట్ వద్ద దీక్ష చేపట్టడంలాంటి కార్యక్రమాలతో మనం చేస్తున్న పోరాటం అందరి దృష్టికి వెళ్లిందని... రేపటి సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుందామని.. ఢిల్లీ నుంచి వచ్చేయాలని ఎంపీలను ఆయన ఆదేశించారట. చంద్రబాబు ఆదేశాలతో రేపు ఉదయం కల్లా టీడీపీ ఎంపీలు ఏపీకి చేరుకోనున్నారు.