చంద్రబాబుకు అడ్డుతగిలిన వైకాపా..!!

ప్రత్యేక హోదా పై అసెంబ్లీ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రసంగానికి వైకాపా సభ్యులు అడ్డుతగిలారు.చంద్రబాబు అసత్యాలు చెబుతున్నారంటూ వైకాపా సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు.దీని పై మంత్రి యనమల స్పందిస్తూ సభా నాయకుడి ప్రసంగానికి అడ్డుతగలడం సభామర్యాదకు భంగం కలిగించినట్లేనన్నారు.సభానేత ప్రకటన చేస్తున్నప్పుడు మధ్యలో ప్రశ్నలకు అవకాశం లేదని తేల్చిచెప్పారు.