చంద్రబాబు మరో పెళ్ళికి సిద్ధమయ్యారు - జగన్

రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు కామన్.. వాటికీ ఎవరూ అతీతం కాదు.. కానీ వైసీపీ అధినేత జగన్ విమర్శలే కాస్త వింతగా ఉంటున్నాయి.. ఆయన విమర్శలు ఏంటో పెళ్లి చుట్టూ తిరుగుతున్నాయి.. మొన్నటికి మొన్న, పవన్ కళ్యాణ్ కార్లను మార్చినట్టు భార్యలను మారుస్తున్నాడని పవన్ పెళ్లిళ్ల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జగన్ అప్పుడు తీవ్ర విమర్శలు మూటకట్టుకున్నారు.. అయితే తాజాగా జగన్ అదే పెళ్లిళ్ల ప్రస్తావనతో ఏపీ సీఎం చంద్రబాబు మీద విమర్శలు చేసారు.

 

 

చంద్రబాబు ఇప్పటికే ఐదు పెళ్లిళ్లు చేసుకొని వదిలేసి, ఇప్పుడు ఆరో పెళ్లికి సిద్దమయ్యారట.. రామ రామ చంద్రబాబుకి అయింది ఒకే పెళ్లిగా అంటారా?.. పెళ్లి అంటే మీరు అనుకునే పెళ్లి కాదులేండి.. జగన్ దృష్టిలో పెళ్లి అంటే పార్టీతో పొత్తు.. బీజేపీ, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, జనసేనలను పెళ్లి  చేసుకుని వదిలేసిన చంద్రబాబు ఇప్పుడు  కాంగ్రెస్ పార్టీని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారంటూ జగన్ విమర్శించారు.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు, రాయబారిగా నారా బ్రాహ్మణిని రాహుల్ గాంధీ నిర్వహించిన భేటీకి పంపారని జగన్ ఆరోపించారు.. నిజానికి రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇండస్ట్రియలిస్ట్స్, బిజినెస్ పీపుల్ తో భేటీ నిర్వహించారు.. దానిలో భాగంగానే నారా బ్రాహ్మణి హెరిటేజ్ సంస్థ తరుపున భేటీకి వెళ్లారు.. కానీ జగన్ మాత్రం రాజకీయ రాయబారం కోసమే నారా బ్రాహ్మణిని భేటీకి పంపారంటూ ఆరోపిస్తున్నారు.. చూద్దాం మరి జగన్ చెప్పినట్టు చంద్రబాబు, కాంగ్రెస్ ని పెళ్లి చేసుకుంటారా?.. అదే అదే పొత్తు పెట్టుకుంటారా? తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.