చంద్రబాబు పర్యటనలో అపశృతి....

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది.  కాకినాడలో పర్యటిస్తున్న చంద్రబాబు స్వచ్ఛాంధ్రప్రదేశ్‌, దోమలపై దండయాత్ర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కాన్వాయ్‌లోని మీడియా వాహనంపై నుంచి పాత్రికేయుడు మాధవకృష్ణ కింద పడిపోయారు. గాయపడిన మాధవకృష్ణను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.