కాలుపెట్టిన చంద్రబాబు.. భారీ వర్షం



ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లోని తన నివాసంలోకి సతీసమేతంగా అడుగుపెట్టారు. గుంటూరు జిల్లా ఉండవల్లి సమీపంలో కృష్ణా నది కరకట్టను ఆనుకొని ఉన్న లింగమనేని గ్రూపునకు చెందిన అతిథి గృహాన్ని సీఎం నివాసంగా అధికారులు సర్వహంగులతో తీర్చిదిద్దారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు సతీసమేతంగా ఇంట్లో కాలు పెట్టారు. ఇదిలా ఉండగా ఇకపై విజయవాడలో ఉన్నన్ని రోజులూ ఆయన ఈ ఇంట్లోనే ఉండటంతో ఇంటి వద్ద, పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా ఇంటిపనులు ఇంకా పూర్తి కాకుండానే ఆగష్టు 29న మంచిరోజు అని సీఎం సతీమణి భువనేశ్వరి ఇంట్లో పాలు పొంగించిన విషయం తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu