శిశుమరణాల రేటు తగ్గించాలి... చంద్రబాబు

 

గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన పెంటావాలెంట్ టీకాల వాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంటావాలెంట్ వాక్సిన్ కోరింతదగ్గు, ధనుర్వాతం, హైపటైటిస్-బి వంటి వ్యాధుల నుండి కాపాడుతుందని అన్నారు. శిశుమరణాల రేటును తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, గర్భిణీలకు అంగన్ వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం ఇస్తున్నామని చెప్పారు. ఐఎంఆర్, ఎంఎంఆర్, పెళ్లి వయసు విభాగాల్లో వెనుకబడి ఉన్నామని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu