జయలలిత రూట్లో చంద్రబాబు



ఏపీ సీఎం చంద్రబాబు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రూట్లోనే నడుస్తున్నట్టు తెలుస్తోంది. తమిళనాడులో జయలలిత పేరు మీదిగా అమ్మ క్యాంటీన్లు ఉన్నట్టే ఏపీలో కూడా అన్న సంజీవినీ ఫుడ్ క్యాంటిన్లు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా ప్రకటించారు. ఈరోజు గ్రామీణాభివృద్ధిశాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలోనే అన్న సంజీవని ఫుడ్ క్యాంటిన్లను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. అలాగే డ్వాక్రా మహిళల గురించి మాట్లాడుతూ డ్వాక్రా మహిళలు నైపుణ్యాన్ని పెంచుకోవాలని.. 2019 నాటికి డ్వాక్రా మహిళలు వంద శాతం అక్షరాస్యత సాధించాలని చంద్రబాబు నాయుడు అన్నారు. త్వరలో అక్షర వెలుగు లేదా అక్షర సంక్రాంతి పేరుతో కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu