వ్యవహారమంతా గవర్నర్ చూసుకుంటారు

తెలంగాణ తెరాస నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించారంటూ చంద్రబాబు స్టీఫెన్ ల ఆడియో టేపులను టీ న్యూస్ ఛానల్ నిన్న రాత్రి బటయపెట్టిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి దత్తాత్రేయ గవర్నర్ ను కలిసి ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడినట్టు సమాచారం. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు భవిష్యత్ రాజకీయాలకు మంచిది కాదని, ఇలాంటి పరిణామాలు జరగడం చాలా బాధాకరమని దత్తాత్రేయ అన్నారు. అయితే ఆడియో టేపుల వ్యవహారంపై ఇప్పడేమి మాట్లాడలేనని, ఈ వ్యవహారమంతా గవర్నర్ చూసుకుంటారని స్పష్టం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News