సంక్షోభంలో కేంద్ర ప్రభుత్వం

 

డిఎంకే అధినేత కరుణానిధి సంచలనాత్మక నిర్ణయంతో కేంద్రలోని యుపిఏ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. శ్రీలంకలోని తమిళుల ఊచకోతను ఖండిస్తూ పార్లమెంటులో తీర్మానం చేయటంతో పాటు శ్రీలంక యుద్ధనేరాలపై స్వతంత్ర దర్యాప్తునకు భారత్ పట్టుబట్టాలని కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్న డిఎంకే అధినేత కరుణానిధి మంగళవారం రాత్రి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. యూపీఏలోని అతిపెద్ద మిత్రపక్షమైన డిఎంకే తన మద్దతును ఉపసంహరించుకుంది. కేంద్రంలోని మంత్రిపదవులను సైతం త్యజిస్తామని కరుణానిధి ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వానికి మద్ధతు ఉపసంహరిస్తూ టి.ఆర్. బాలు నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల డిఎంకే బృందం తమ అధినేత కరుణానిధి రాసిన లేఖను రాష్ట్రపతికి స్వయంతా అందజేశారు. బుధవారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను కలిసి మన్త్ర౪ఇపదవుల రాజీనామాలు సమర్పిస్తామని బాలు బృందం విలేఖరులకు తెలిపారు.యూపీఏ ప్రభుత్వానికి బయటనుండి కూడా మద్దతునిచ్చే ప్రసక్తే లేదని కరుణానిధి స్పష్టం చేశారు. ఈ నెల 21న జెనీవాలో జరగనున్న ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సమావేశానికి ముందుగా తమ డిమాండ్లను నెరవేరిస్తే తమ మద్దతుపై పునః పరిశీలిస్తామని కరుణానిధి పేర్కొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu