ఓఎంసీ కేసు : సబితపై చార్జిషీటు

 

 

 

ఓబుళాపురం మైనింగ్ స్కామ్ కేసులో రాష్ట్ర మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి సాక్షి కాదు దోషి అని సీబీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సీబీఐ సబితా ఇంద్రారెడ్డితోపాటు విశ్రాంత ఐఎఎస్ అధికారి కృపానందంపై సీబీఐ బుధవారం నాడు తుది చార్జిషీట్ దాఖలు చేసింది. ఐపీసీ సెక్షన్లు 125, 120బి, 409, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13 (2) కింద వీరిద్దరి మీద కేసు నమోదు చేసినట్టు సీబీఐ వెల్లడించింది.