క్యాబినెట్ ముందుకు తెలంగాణ నోట్..!

 

Cabinet note on Telangana,Telangana note, Centre to act on Telangana, Draft Telangana note ready

 

 

రాష్ట్ర విభజనపై కేంద్రం దూకుడు పెంచింది. కిరణ్ ధిక్కారణ ధోరణితో ప్రక్రియను త్వరగా పూర్తి చే యాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబందించి నోట్ ఈ రోజు సాయంత్రం కేంద్ర కేబినెట్ కే రాబోతోందని పెద్ద ఎత్తున కధనాలు వస్తున్నాయి. 22 పేజీల తెలంగాణ నోట్‌ను కేంద్ర తయారు చేసినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఏర్పాటు చేయగా, సీమాంధ్ర రాజధానిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఉమ్మడి రాజధానిపై మరో బిల్లు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నదీ జలాలు, ఇతర సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రుల కమిటీని నియమించన్నుట్లు సమాచారం. సీమాంధ్రలో సాగుతున్న ఉద్యమం, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి మొదలైనవాటిని కూడా కేంద్రం, కాంగ్రెస్ అధిష్ఠానం నిశితంగా పరిశీలిస్తున్నాయని జాతీయ వార్తా చానెళ్లలో కధనాలు వస్తున్నాయి.