పోలవరంపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

పోలవరం ప్రాజెక్టుపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరాన్ని కేంద్రం కట్టాల్సిన అవసరం లేదని.. తామే నిర్మిస్తామని టీడీపీ నేతలు చెప్పి, కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టును తీసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు దోపిడీ వల్లే పోలవరం నిధులు తగ్గాయని, ప్రస్తుత దుస్థితికి ఆయనే కారణమని విమర్శించారు. అయితే ప్రధాని మోదీని ఒప్పించి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అవసరమైతే పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని బొత్స ప్రకటించారు.

 

కాసుల కక్కుర్తితో ప్రత్యేక హోదాను టీడీపీ నేతలు తాకట్టు పెట్టారని బొత్స విమర్శించారు. చంద్రబాబు హయాంలో 3 లక్షల ఇళ్లకు పునాది వేశారని.. 81,048 ఇళ్ల నిర్మాణం 95 శాతం పూర్తయిందని చెప్పారు. ఇళ్లను ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ధర్నా అంటూ చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని బొత్స విమర్శించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu