బీజేపీ ఎంపీలకు మోడీ రూల్స్!!

 

బీజేపీ ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ కొన్ని నియమ నిబంధనలు పెట్టారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఎట్టి పరిస్థితుల్లోనూ విదేశాలకు వెళ్లకూడదని నరేంద్రమోడీ ఆంక్షలు విధించారు. పార్టీ కీలక సమావేశాలకు భారతీయ జనతాపార్టీ ఎంపీలు తప్పనిసరిగా హాజరైతీరాలని పేర్కొన్నారు. అలాగే బీజేపీ అధికార ప్రతినిధులు ప్రతి మంగళవారం తప్పనిసరిగా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ‌తో సమావేశం అవ్వాలని, పార్టీని సంప్రదించకుండా బీజేపీ ఎంపీలు పార్లమెంట్‌లో ఏ రకమైన తీర్మానాలనూ ప్రవేశ పెట్టరాదని సూచించారు.