Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...దానిపై కేంద్రం నిర్ణయమే తీసుకోలేదుట!
posted on: Jun 23, 2015 9:23PM
.jpg)
నిన్న మొన్నటి వరకు ఓటుకి నోటు, టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలపై రాజకీయపార్టీల నేతలు వాదోపవాదాలు చేసుకొన్నారు. ఇప్పుడు తాజాగా విభజన చట్టంలో సెక్షన్: 8 అమలుపై వాదోపవాదాలు మొదలుపెట్టారు. తెలంగాణాకు చెందిన కొందరు దానికి వ్యతిరేకంగా, ఆంధ్రాకి చెందిన నేతలు దానికి మద్దతుగా వాదోపవాదాలు చేసుకొంటూ మీడియాకు మంచి పని కల్పిస్తున్నారు. సెక్షన్: 8 అమలుచేస్తే మళ్ళీ మరో ఉద్యమం తప్పదని తెలంగాణా నేతలు హెచ్చరిస్తుంటే, చట్టంలో ఉన్న మిగిలిన అన్ని సెక్షన్లను అంగీకరించినవారు సెక్షన్: 8ని మాత్రం ఎందుకు అంగీకరించరు? తప్పనిసరిగా దానిని అమలుచేయవలసిందే అని ఆంధ్రా నేతలు వాదిస్తున్నారు. కొందరు తెలంగాణా ఉద్యోగ సంఘాల నేతలు రేపటి నుండి నిరసన కార్యక్రమాలు, ధర్నాలు వగైరాలకు సిద్దమయిపోతున్నారు.
కానీ గమ్మత్తయిన విషయం ఏమిటంటే సెక్షన్: 8 అమలు గురించి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, బీజేపీని అప్రదిష్ట పాలుజేసేందుకే కొందరు రాజకీయనాయకులు పనిగట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని అసత్య ప్రచారం చేస్తున్నారని బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. అయితే ఈ వ్యవహారమంతా డిల్లీలో ఆడిటర్ జనరల్ ముకుల్ రోహాత్గీ కేంద్ర హోం శాఖకు చెప్పిన తరువాతనే రెండు తెలుగు రాష్ట్రాలలో దీనిపై చర్చ మొదలయింది తప్ప రాష్ట్రంలో ఎవరో సృష్టించడం వలన కాదని కిషన్ రెడ్డి మరిచిపోయినట్లున్నారు.



.jpg)


