Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...భోగి మంటల్లో అపశ్రుతి
posted on: Jan 13, 2013 12:16PM

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాకలో ఆదివారం తెల్లవారుజామున భోగి మంటల వేడుకల్లో అపశ్రుతి జరిగింది. భోగి మంటలు వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. క్షతగాత్రుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. భోగి మంటల్లో పేయింట్ డబ్బా వేయడమే ఈ ప్రమాదం జరగడానికి కారణంగా భావిస్తున్నారు.
Latest YouTube Trending Video NEWS






