బీసీసీఐ పేరు మారబోతోంది..?

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్రికెట్ బోర్డుగా పేరు గాంచిన బీసీసీఐ పేరు మారబోతోంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ స్వయంగా ప్రకటించారు. 1928లో బోర్డు ఏర్పడిన నాటి నుంచి ఇదే పేరు స్థిరపడిపోయింది. "ది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా"లో "కంట్రోల్" అనే పదాన్ని మార్చనున్నట్లు ఠాకూర్ తెలిపారు. బోర్డు ఎవరిని నియంత్రించదని..ఆటగాళ్లు, క్రికెట్ అభిమానులు, కోచ్‌లు, సెలక్టర్లు, పరిపాలనా విభాగానికి చెందిన ప్రతి ఒక్కరి క్షేమాన్ని కోరుకుంటుందని అన్నారు. అందువల్ల "కంట్రోల్" అన్న పదం మార్చి దాని స్థానంలో "కేర్" అనే పదాన్ని పెట్టాలనుకుంటున్నామని అనురాగ్ ఠాకూర్ అన్నారు. బీసీసీఐ వెబ్‌పైట్‌లో దీనిపై ఓటింగ్ పెడతామని ఆయన తెలిపారు.