అవనిగడ్డలో 47శాతం పోలింగ్

 

Avanigadda bypoll, Poor turnout for Avanigadda bypoll, 47 per cent polling in Avanigadda

 

 

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో బుధవారం జరిగిన ఉప ఎన్నికలో 47 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచి పోలింగ్ మందకొడిగా సాగింది. ఏ పోలింగ్ బూత్‌లోనూ ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు కానరాలేదు. నియోజకవర్గంలో మొత్తం 1,88,213 మంది ఓట్లర్లకు గాను 88682 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నెల 24న ఓట్ల లెక్కింపు జరగనుంది. సమైకాంద్ర ఉద్యమాలు నడుస్తుండంతో పోలింగ్ శాతం తక్కువగా నమోదయ్యిందని అధికారులు తెలిపారు. 2009 సాధారణ ఎన్నికల్లో 86.3 శాతం పోలింగ్ నమోదయింది.