అమరావతి శంకుస్థాపన.. ఇన్విటేషన్ కార్డ్ ఇదే

ఈనెల 22న మధ్యాహ్నం 12.45 గంటలకు ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం జరగనున్నసంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక మందిని ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డును ఆవిష్కరించారు. ఈ కార్డును చూస్తుంటే ఏపీ ప్రభుత్వం దీనిని చాలా చక్కగా తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. పూర్ణకుంభం చిత్రంతో కూడిన ఆహ్వాన పత్రికను ప్రభుత్వం తరఫున ప్రధాని మోడీకి ప్రత్యేక ఆహ్వానాన్ని తెలియజేస్తూ దీనిని రూపొందించారు. మరోవైపు ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి.. చేపట్టవలసిన బాధ్యతలను తదితర అంశాలను చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అంతేకాదు ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకునేలా చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అంశంతో పాటు రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్చనున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu