అమరావతికి వంద ప్రత్యేక విమానాలు

నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవాన్ని పెద్ద పండుగులా చేయాలనుకుంటున్న ఏపీ ప్రభుత్వం.... తరలివచ్చే అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది, శంకస్థాపన కార్యక్రమానికి వచ్చే వీవీఐపీలను తరలించేందుకు వంద ప్రత్యేక విమానాలను వినియోగించాలనుకుంటోంది, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, హైదరాబాద్ విమానాశ్రయాల ద్వారా అతిథులను తరలించడంతోపాటు అమరావతి పరిసర ప్రాంతాల్లో 13 హెలిప్యాడ్లను కూడా రెడీ చేస్తోంది, దేశ విదేశాల నుంచి తరలివచ్చే అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం.... శంకుస్థాపన కార్యక్రమాన్ని కళ్లుచెదిరే రీతిలో చేయనుంది, ఈ కార్యక్రమం నిమిత్తం మొత్తం మూడు వేదికలను రెడీ చేస్తున్నారు, ప్రధాన వేదికపై ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, గవర్నర్ నర్సింహన్, కేంద్ర మంత్రులు, జపాన్, సింగపూర్ తోపాటు విదేశీ ప్రతినిధులు మాత్రమే కూర్చుంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి

Online Jyotish
Tone Academy
KidsOne Telugu