ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మూడు రాజధానులకే ఓటు

సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కొనసాగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మొత్తం ఏడు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజధాని అంశంలో హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికకు ఆమోద ముద్ర వేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం నిర్ణయం తీసుకుంది. విశాఖకు సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయాలు కేటాయింపుకు నిర్ణయించింది. అమరావతిలో అసెంబ్లీ కొనసాగించేలా, కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు కౌలు 10 ఏళ్ల 15 ఏళ్లకు పెంచేలా.. పలు నిర్ణయాలను ఏపీ కేబినెట్ తీసుకుంది. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ అంశంపై విచారణను లోకాయుక్తకు అప్పచెప్పాలని కేబినెట్‌ నిర్ణయించింది. అదేవిధంగా పులివెందుల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు, 11 వేల రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.