ఏపీ అసెంబ్లీలో మళ్లీ గందరగోళం...

 

ఏపీ అసెంబ్లీలో ఈ రోజు కూడా గందరగోళం నెలకొంది. నిన్న మొన్నటి వరకూ అగ్రిగోల్డ్ అంశంపై అధికార పక్ష, విపక్ష నేతల సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య సభ అట్టుడకగా.. ఈరోజు మరో అంశంపై వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. బీసీల సమస్యపై మాట్లాడాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనలు చేశారు.