ఆంధ్రా అమ్మాయికి కామన్వెల్త్ పతకం!!

 

ఆంధ్రప్రదేశ్ అమ్మాయి కామన్వెల్త్ క్రీడల్లో కాంస్య పతకం సాధించింది. ఈ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి మత్స సంతోషి కాంస్యం సాదించింది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండ వెలగాడ చెందిన మత్స సంతోషి 53 కిలోల వెయిట్‌ లిఫ్టింగ్‌లో కాంస్య పతకం సాధించింది. ఇంటర్‌ పూర్తి చేసిన మత్స అంతర్జాతీయ, జాతీయస్థాయిలో ఎన్నో పతకాలు సాధించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల వేటలో దూసుకుపోయింది. భారత్ మూడో స్వర్ణం గెలుచుకుంది.