జాతీయ గీతం పాడిన అమితాబ్ పై ఫిర్యాదు..

 

ఐసీసీ వరల్డ్ టీ20 సందర్భంగా.. మార్చి 19న భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈసందర్భంగా  బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ మ్యాచ్ ఆరంభానికి ముందు జాతీయ గీతం పాడారు. అయితే ఆ మ్యాచ్ అయిపోయింది.. భారత్ విజయం కూడా సాధించింది. కానీ ఇప్పుడు ఆ మ్యాచ్ సందర్భంగా అమితాబ్ బచ్చన్ జాతీయగీతం సరిగా పాడలేదంటూ ఢిల్లీలోని ఆశోక్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఉల్లాస్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. నిర్ణీత సమయానికన్నా ఎక్కువసేపు అమితాబ్ జాతీయ గీతాన్ని ఆలపించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu