చంద్రబాబును మేమేం వెళ్లమనలేదు..

 

ఎన్డీయే నుండి టీడీపీ బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే కదా. దీనిపై స్పందించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా ఛానల్ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు కావాలనే ఎన్డీయే నుంచి బయటకు వెళ్లారు...చంద్రబాబు వెళ్తామన్నప్పుడు తామెలా ఆపుతామని .. టీడీపీ వెళ్లినంత మాత్రాన తమకు భయం లేదని, కూటమిలో ఇంకా 30 పార్టీలు ఉన్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో  మళ్లీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో 300కు పైగా స్థానాలు గెలుచుకుంటామని షా జోస్యం చెప్పారు. అవిశ్వాసానికి తాము భయపడడం లేదని.. అన్నాడీఎంకే, టీఆర్ఎస్‌లే అవిశ్వాసంపై చర్చకు అడ్డుపడుతున్నాయని షా ఆరోపించారు.